కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాతంగి కుమార్.
స్టేషన్ ఘనాపూర్, సెప్టెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా మాతంగి కుమార్ (కొమురయ్య) నియమితులయ్యారు. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన స్టేషన్ ఘనాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి సింగపురం ఇందిర మేడం, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు వేముల మల్లేష్ అన్న, యువ నాయకులు సింగపురం ఇమ్మానియేల్ రాజు అన్నలకు ఈ సందర్భంగా మాతంగి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడం తన ప్రధాన లక్ష్యాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ, పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని మాతంగి కుమార్ (కొమురయ్య) స్పష్టం చేశారు.


Comments