వరంగల్ పోలీస్‌ కమిషనరేట్‌కు నూతన సీసీ, పీఆర్వో నియామకం.

వేణుగోపాల్ రావు, మోహన కృష్ణలకు బదిలీ ఉత్తర్వులు.

వరంగల్,సెప్టెంబర్13(తెలంగాణ ముచ్చట్లు): 

వరంగల్ పోలీస్‌ కమిషనరేట్ క్యాంపు క్లర్క్ (సీసీ) వేణుగోపాల్ రావు, పౌర సంబంధాల అధికారి (పీఆర్వో) మోహన కృష్ణలను బదిలీ చేస్తూ పోలీస్‌ కమిషనర్ ఎన్. శ్వేత శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారిక సమాచారం.
వేణుగోపాల్ రావును వరంగల్ రేంజ్ డీఐజీ కార్యాలయానికి, మోహన కృష్ణను స్టేషన్ ఘన్‌పూర్ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం. వారి స్థానాల్లో స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఏవోగా పనిచేస్తున్న ఇషాక్‌ను సీసీగా, సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తిరుపతిని పీఆర్వోగా నియమించినట్లు అధికారులు తెలిపారు.వేణుగోపాల్ రావు, మోహన కృష్ణ ఒకే పోస్టింగ్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారంటూ గతంలో కొన్ని ఆరోపణలు, వార్తా కథనాలు వెలువడినట్లు సమాచారం. ఈ అంశంపై పోలీస్‌ శాఖ అంతర్గతంగా విచారణ జరిపిందా, బదిలీలు ఆ విచారణ ఫలితంగా జరిగాయా అనే విషయంపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తర్వుల ప్రకారం, అధికారుల పరిపాలనా అవసరాల మేరకు బదిలీలు, నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

రబీకి రెడీ అవుతున్న రైతులు.. కేంద్రం కీలక సూచనలు! రబీకి రెడీ అవుతున్న రైతులు.. కేంద్రం కీలక సూచనలు!
జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు): రాబోయే రబీ సీజన్‌లో రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ...
తల్లిదండ్రుల జ్ఞాపకాలకు.. సేవా స్మారకం!
నాటి జ్ఞాపకాలు.. నేడు ఆత్మీయ కలయిక!
దళితబంధు నిధులకు కదలిక.. త్వరలో విడుదల ప్రక్రియ.
కేసీఆర్ పై అభిమానం చాటుకున్న వార్డు సభ్యుడు.
కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి.
ప్రజా అవసరాలే ప్రథమ ప్రాధాన్యం.