వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలి .

చిల్పూర్ ఎస్సై సిరిపురం నవీన్ కుమార్ .

వినాయక మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలి .

చిల్పూర్,సెప్టెంబర్12(తెలంగాణ ముచ్చట్లు): 

మండలంలోని ప్రతి గ్రామంలో రాబోయే వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేయనున్న మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చిల్పూర్ ఎస్సై సిరిపురం నవీన్ కుమార్ విజ్ఞప్తి చేశారు.ప్రతి వినాయక మండపం ఏర్పాటుకు ముందుగా పోలీస్‌స్టేషన్ అనుమతిని ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా పూర్తి చేయాలని, ఇందుకోసం ఎవరూ పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదన్నారు. అనుమతి కోసం https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా సరైన వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.

మండపం ఏర్పాటుకు విద్యుత్ శాఖ అనుమతి కూడా పొందాలని తెలిపారు. భద్రత కోసం మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదన్నారు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్లు, డీజేలు వినియోగించరాదని, నిబంధనల ప్రకారం సౌండ్ లిమిట్ పాటించాలని సూచించారు.
రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా మండపాలు ఏర్పాటు చేయరాదని, శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత. టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత.
మానకొండూర్, సెప్టెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు ): మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల పరిధిలోని టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఆహార సరుకులను పంపిణీ చేశారు....
దళిత బంధు నిధుల కోసం రిలే దీక్షలు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి.
డప్పు ధర్నాలో పాల్గొన్న వెల్టూర్‌ కాంగ్రెస్‌ నాయకులు.
అధికారుల నిర్లక్ష్యానికి గురుకుల విద్యార్థులే బలి కావాలా?
రైతుల పంటలు ఎండిపోకుండా వెంటనే సాగునీరు విడుదల చేయాలి.
దళిత జర్నలిస్టుల పోరం 11వ రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి.