గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలి.

డీజేలకు అనుమతి లేదు.

గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలి.

పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి

పెద్దమందడి,సెప్టెంబర్11(తెలంగాణ ముచ్చట్లు):

గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించాలని వనపర్తి జిల్లా పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి సూచించారు. మండల పరిధిలో ఇప్పటివరకు 15 గణేష్ మండపాలకు అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు.గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై కోరారు. డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. మండపాల వద్ద విద్యుత్ వైర్ల విషయంలో నిర్వాహకులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, పోలీసులకు సహకరించాలని ఎస్సై జలంధర్ రెడ్డి కోరారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు. ప్రజా సమస్యలపై తీన్మార్ మల్లన్న పాదయాత్రకు సన్నాహాలు.
* హుజూరాబాద్‌ నుంచి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వరకు పార్టీ శ్రేణుల పాదయాత్ర జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు): రాష్ట్ర ప్రజల...
వీధి వ్యాపారులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి.
హిమ్మత్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం.
ప్రశాంత వాతావరణంలో  గణేష్ ఉత్సవాల నిర్వహణకు సహకారించాలి.
ఎస్సారెస్పీ కాలువల్లో ముందస్తుగా నీటిని విడుదల చేయాలి.
ఉత్తమ ఉపాధ్యాయుడిని సత్కరించిన భారాస నాయకులు .
దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు.