కొత్తూరులో కాంగ్రెస్‌ ఇంటింటి ప్రచారం.

కొత్తూరులో కాంగ్రెస్‌ ఇంటింటి ప్రచారం.

సత్తుపల్లి, సెప్టెంబరు 9 (తెలంగాణ ముచ్చట్లు): 

కాంగ్రెస్‌ ప్రభుత్వం 1,000 రోజుల ప్రజాపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సత్తుపల్లి మండలం కొత్తూరులో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుడు డాక్టర్‌ మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాలు, వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్‌ దోమ ఆనంద్, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, కొత్తూరు గ్రామ సర్పంచ్‌, మండల, గ్రామ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తీగలతండాలో ఘనంగా బోనాలు. తీగలతండాలో ఘనంగా బోనాలు.
డప్పుచప్పుళ్లు.. శివసత్తుల శిగాలు.. డీజే పాటలతో సందడి పోచమ్మ తల్లికి బోనాలతో మహిళల మొక్కులు స్టేషన్‌ఘన్‌పూర్‌, సెప్టెంబర్‌ 9 (తెలంగాణ ముచ్చట్లు):  శ్రావణమాసం ముగుస్తున్న సందర్భంగా చిల్పూర్‌...
కాళోజీకి ఘన నివాళులు.
విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ.
అంగన్‌వాడీల ముందస్తు అరెస్టులను ఖండించిన బీఆర్‌ఎస్‌.
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి.!
కొత్తూరులో కాంగ్రెస్‌ ఇంటింటి ప్రచారం.
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్.