ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా సర్వేపల్లి రాధాకృష్ణన్.
మంజులత, మండల విద్యాధికారి.
పెద్దమందడి,సెప్టెంబరు07(తెలంగాణ ముచ్చట్లు):
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులను అలంకరించి ఉపాధ్యాయులందరికీ ఎనలేని కీర్తిని తీసుకువచ్చారని వనపర్తి జిల్లా పెద్దమందడి మండల విద్యాధికారి మంజులత అన్నారు.రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సోమవారం పెద్దమందడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన 17 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి శాలువా, పుష్పగుచ్ఛం, ప్రశంసాపత్రం, జ్ఞాపికలతో సన్మానించారు.ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మంజులత పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను నేర్పుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేసి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో రేవల్లి మండల విద్యాధికారి వరప్రసాద్రావు, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు శాంతన్న, పి. ప్రసాద్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు, వెంకటేష్, పెద్దమందడి సర్పంచ్ గంగమ్మ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉత్తమ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Comments