చింతకుంటలో ఘనంగా అంబికా బ్యాంకెట్ హాల్ ప్రారంభం.
ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి: అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి.
కరీంనగర్, సెప్టెంబర్ 8(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ శివారులోని చింతకుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబికా ఏసీ బ్యాంకెట్ హాల్ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అల్ఫోర్స్ డా.వి.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్తో కలిసి ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్ ఆధ్వర్యంలో ఎస్బీఐ కార్యాలయం పైభాగంలో ఈ బ్యాంకెట్ హాల్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వాణిజ్య రంగంలో నూతన ఒరవడిని సృష్టించేలా ముందుకు సాగాలని నిర్వాహకులకు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా నాణ్యమైన సేవలను అందిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.


Comments