విద్యార్థులకు షూస్, సాక్స్ పంపిణీ.
ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి.
సైదాపూర్ ,సెప్టెంబర్ 9(తెలంగాణ ముచ్చట్లు ):
ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు సమకూర్చిన షూస్, సాక్స్ను బుధవారం పంపిణీ చేశారు. విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరై చదువుల్లో రాణించడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాఠశాలల్లో వివిధ సౌకర్యాలను కల్పిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులకు షూస్, సాక్స్ అందజేయడం జరిగిందన్నారు. వీటిని విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ వేముల శ్రీకాంత్, ఉపసర్పంచ్ శ్రీ కొంకట పవన్, పాఠశాల సముదాయాల హెడ్మాస్టర్ శ్రీ సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు షూస్, సాక్స్ అందజేసి వారిని అభినందించారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు.


Comments