టీబీ బాధితుల సంక్షేమానికి చేయూత.
మానకొండూర్లో ఉచిత ఆహార సరుకులు పంపిణీ చేసిన డా. కవ్వంపల్లి అనురాధ.
మానకొండూర్, సెప్టెంబర్ 12(తెలంగాణ ముచ్చట్లు ):
మానకొండూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల పరిధిలోని టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా ఆహార సరుకులను పంపిణీ చేశారు. మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ గారి సతీమణి, అంకిత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎం.డీ డా. కవ్వంపల్లి అనురాధ ఈ కార్యక్రమంలో పాల్గొని టీబీ బాధితులకు ఆహార కిట్లను అందజేశారు.
టీబీ వ్యాధిగ్రస్తులకు వైద్య చికిత్సతో పాటు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడేందుకు సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వినియోగిస్తూ, వైద్యుల సూచనలు పాటించాలని ఆమె సూచించారు.
సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన టీబీబాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆమె కోరారు.


Comments