భక్తితో వినాయకుడిని పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం.

పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలి: మేయర్ కొలగాని శ్రీనివాస్.

భక్తితో వినాయకుడిని పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం.

కరీంనగర్, సెప్టెంబర్ 13(తెలంగాణ ముచ్చట్లు ):

కరీంనగర్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ డివిజన్ తీగలగుట్టపల్లిలోని మేయర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని భక్తులకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు.

అదేవిధంగా 22వ, 50వ డివిజన్ల పరిధిలోని చైతన్యపురి కాలనీ, 14వ డివిజన్ చింతకుంటలో నిర్వహించిన ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాల్లోనూ మేయర్ పాల్గొని ప్రజలకు విగ్రహాలను అందజేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజించాలని కోరారు. మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడుకోవచ్చని తెలిపారు.

రసాయనాలు, హానికర పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు పర్యావరణానికి హాని కలిగించని మట్టి గణపతులనే వినియోగించాలని సూచించారు.

“పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. మట్టి గణపతుల ప్రతిష్టాపనతో పచ్చని కరీంనగర్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి” అని మేయర్ పిలుపునిచ్చారు.

నగరంలోని అన్ని డివిజన్లలో మట్టి గణపతి విగ్రహాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పర్యావరణహితమైన వినాయక చవితిని జరుపుకోవాలని కోరారు.

కరీంనగర్‌ను పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటూనే ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని మేయర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోయినపల్లిప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి, గడ్డి ప్రదీప్, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. IMG-20260913-WA0002

Tags:

Post Your Comments

Comments

Latest News

రబీకి రెడీ అవుతున్న రైతులు.. కేంద్రం కీలక సూచనలు! రబీకి రెడీ అవుతున్న రైతులు.. కేంద్రం కీలక సూచనలు!
జమ్మికుంట టౌన్ సెప్టెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు): రాబోయే రబీ సీజన్‌లో రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ...
తల్లిదండ్రుల జ్ఞాపకాలకు.. సేవా స్మారకం!
నాటి జ్ఞాపకాలు.. నేడు ఆత్మీయ కలయిక!
దళితబంధు నిధులకు కదలిక.. త్వరలో విడుదల ప్రక్రియ.
కేసీఆర్ పై అభిమానం చాటుకున్న వార్డు సభ్యుడు.
కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలి.
ప్రజా అవసరాలే ప్రథమ ప్రాధాన్యం.