విశ్వేశ్వరయ్య సేవలు చిరస్మరణీయం.
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు.
Views: 0
On
కరీంనగర్, సెప్టెంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు ):
కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో భారతరత్న, భారతదేశ సాంకేతిక పితామహుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఇంజనీరింగ్ రంగానికి విశ్వేశ్వరయ్య అందించిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
16 Sep 2026 14:22:57
జఫర్గడ్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు)
మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామానికి చెందిన రంగు శివ గౌడ్(25) ఇటీవల హఠాత్మరణం చెందగా శివ చిన్ననాటి మిత్రులు (10వ...


Comments