మిషన్ భగీరథ అధికారులపై సర్పంచుల ఆగ్రహం.

పెద్దమందడి మండల సర్వసభ సమావేశంలో అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి.

మిషన్ భగీరథ అధికారులపై సర్పంచుల ఆగ్రహం.

పెద్దమందడి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండల సర్వసభ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల సర్పంచులు మిషన్ భగీరథ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సర్వసభ సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కారం చూపకపోవడంపై నిలదీశారు.పలు గ్రామాల్లో పైపులైన్లు, నీటి సరఫరాకు సంబంధించిన ఇబ్బందులతో ప్రజలు అవస్థలు పడుతున్నారని సర్పంచులు తెలిపారు. గత సమావేశంలో హామీ ఇచ్చినప్పటికీ సమస్యల పరిష్కారంలో ఎలాంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తమకు ఎదురవుతోందని పేర్కొన్నారు.తాగునీటి వంటి కీలక అంశాలను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి గ్రామాలకు సక్రమంగా నీటి సరఫరా అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు సూచించిన అంశాలపై అధికారులు స్పష్టమైన కార్యాచరణ రూపొందించి త్వరితగతిన పరిష్కారం చూపాలని సమావేశంలో పలువురు సూచించారు.IMG-20260915-WA0008

Tags:

Post Your Comments

Comments

Latest News

మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు. మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన బాల్య మిత్రులు.
జఫర్గడ్, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు) మండలం లోని తమ్మడపల్లి జీ గ్రామానికి చెందిన రంగు శివ గౌడ్(25) ఇటీవల హఠాత్మరణం చెందగా శివ చిన్ననాటి మిత్రులు (10వ...
దొరలు, భూస్వాముల దోపిడీ నుంచి తెలంగాణను విముక్తి చేసిన పోరాటం.
ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కలిసిన ఎడ్ల కుమార్.
పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..మాజీ ఉపముఖ్యమంత్రి కడియం.
వేలేరు పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్‌పై విలేకరుల ఫిర్యాదు.
పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యే లక్ష్యం.
మానకొండూర్‌లో 50 పడకల ఆసుపత్రి పనుల పరిశీలన.