రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం... 

అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి .

రీ-సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం... 

 ఖమ్మం బ్యూరో , సెప్టెంబరు- 16(తెలంగాణ ముచ్చట్లు )

ప్రభుత్వం చేపడుతున్న రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు.

బుధవారం ముదిగొండ మండలం ఖానాపురం గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ సర్వే ప్రక్రియ ను అదనపు కలెక్టర్ పరిశీలించారు.  రీ సర్వే మొత్తం ప్రక్రియ పూర్తిగా క్షేత్ర స్థాయిలో భూ హక్కుదారిని తో పాటు, సరిహద్దు రైతుల సమక్షంలో జరగాలని,  రైతుల హక్కులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  రైతులు అపోహలకు గురికాకుండా అధికారులు అందించే సమాచారాన్ని నమ్మకంతో భూ రీ-సర్వే కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు.

 సర్వే అనంతరం గ్రామాల్లో భూ వివరాలను ప్రకటించి, వివరాలను గ్రామ పంచాయతీ, తహసీల్దారు కార్యాలయాలలో నోటీస్ బోర్డులో ఉంచుతామని, ఏలాంటి అభ్యంతరాలకు గడువు ఇస్తామని, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన తర్వాత వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని పేర్కొన్నారు. రీ-సర్వే పూర్తయిన తర్వాత భవిష్యత్తులో భూ వివాదాలు గణనీయంగా తగ్గి రైతులకు శాశ్వత భద్రత కలుగుతుందని అదనపు కలెక్టర్  స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ముదిగొండ తహసీల్దారు రవి కుమార్, అధికారులు, రైతులు, భూ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి. కోతలు లేకుండా రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలి.
పెద్దమందడి,సెప్టెంబర్‌16(తెలంగాణ ముచ్చట్లు):  రైతులకు కోతలు లేకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతులకు విద్యుత్‌ కోతలతో సాగునీరు...
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం.
భగత్‌నగర్ అభివృద్ధికి రూ.60 లక్షలు.
టెండర్ల నిబంధనల్లో పారదర్శకత ఏదీ?
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి.
22-ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలి.
వరి, వేరుశనగ పంటల్లో చీడపీడలపై క్షేత్ర పరిశీలన.