ఆకస్మిక తనిఖీతో అధికారుల్లో అలర్ట్.
ఎల్కతుర్తి, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ రవి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో కార్యాలయ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన అదనపు కలెక్టర్.. అధికారులు నిర్వహిస్తున్న ఫైళ్లు, రికార్డులు, దస్త్రాలను తనిఖీ చేశారు. పెండింగ్లో ఉన్న ఫైళ్ల వివరాలతో పాటు కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రికార్డులు, దస్త్రాలను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించినట్లు సమాచారం.
ఈ తనిఖీలో తహసీల్దార్ ప్రసాద్ రావు, డిప్యూటీ తహసీల్దార్ రమేష్తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Comments