ఎస్ ఆర్ బి జిఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి.
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 16(తెలంగాణ ముచ్చట్లు )
ఓజోన్ పొరను పరిరక్షించుకోవాలిభావి తరాలకు సమతుల వాతావారణ పరిస్థితులను కానుకగా ఇవ్వాలనుకుంటే ఓజోన్ పొరను పరిరక్షించుకోవాలని ఎస్ఆర్ బిజి ఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా.మొహ్మద్ జాకిరుల్లా అన్నారు బుధవారం నాడు అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణా దినోత్సవాన్ని పురస్కరించుకుని కెమిస్ట్రీ విభాగం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు సందేశాన్ని అందించారు ఓజోన్ పొర నుండి మనకు హానికరమైన యూవీ కిరణాలు భూమి పై చేరకుండా గొడుగు లా పరిరక్షిస్తూ ఉందని తెలిపారు. కార్యక్రమంలో కెమిస్ట్రీ విభాగాధిపతి డా.జి.వీరన్న, వైస్ ప్రిన్సిపాల్ ఏఎల్ఎన్ శాస్త్రి. ఐ.క్యూఏసి కోఆర్డినేటర్ డా.ఎం.సునంద అధ్యాపకులు డా.చందా సుధాకర్,పి.రామచంద్రరావు,డా.మౌలానా కరీం డా.సలీంపాషా,డా.యు.ఉదయలక్ష్మి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments