పాలక సంస్థను వ్యక్తిగత ఆదేశాలకు వాడకూడదు

కార్పొరేటర్ మాధవరం రోజాదేవి అభ్యంతరం

పాలక సంస్థను వ్యక్తిగత ఆదేశాలకు వాడకూడదు

-శంకుస్థాపన ఏర్పాట్లపై కార్పొరేటర్‌కు సమాచారం లేకపోవడంపై ఆగ్రహం

కూకట్‌పల్లి, తెలంగాణ ముచ్చట్లు:

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్‌లో జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాల ఏర్పాటుపై స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజాదేవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత పనులపై కార్పొరేటర్‌కు ముందుగా సమాచారం ఇవ్వకుండా, పదవిలో లేని వ్యక్తుల సూచనల మేరకు అధికారులు నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.

ఇలాంటి చర్యలు ప్రజాప్రతినిధుల హక్కులను విస్మరించినట్లే కాకుండా, ప్రజల్లో సంస్థపై నమ్మకాన్ని తగ్గించే అవకాశముందని వ్యాఖ్యానించారు. గత 10 నెలలుగా అనుపమ బ్యాక్ సైడ్ సిమెంట్ రోడ్డు పనులు మంజూరై ఉన్నప్పటికీ, వాటిని కొనసాగించకుండా నిలిపివేయడం వలన వర్షాకాలంలో ఆ ప్రాంతంలో రెండు అడుగుల వరకూ నీరు నిలిచే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దాంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

వేడేపల్లి ఎన్క్లేవ్ నుంచి మాధవరం నగర్ కాలనీ వరకు నిర్మించిన కల్వర్టు, రోడ్డు ప్రాంతంలో వీధి దీపాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటిపై జోనల్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న