బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తానన్నది కేటీఆరే

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన ఆరోపణ

బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తానన్నది కేటీఆరే

హైదరాబాద్, తెలంగాణ ముచ్చట్లు:

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. కవిత జైలులో ఉన్న సమయంలో కేటీఆర్ తన ఇంటికి వచ్చి, ఈడీ, సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు సహాయం కోరినట్లు ఆయన ఆరోపించారు. అప్పట్లో కేటీఆర్ తానే స్వయంగా బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని చెప్పారని తెలిపారు.

“బీజేపీలోకి విలీనం చేస్తాను, పొత్తుకు సిద్ధం” అని కేటీఆర్ చెప్పినట్లు రమేష్ వెల్లడించారు. ఈ విషయాన్ని ధృవీకరించే సీసీటీవీ ఫుటేజీ కూడా తమ వద్ద ఉందని పేర్కొన్నారు. “ఈ ఆరోపణలపై కేటీఆర్ బహిరంగంగా స్పందించాలి. నిజమైతే అంగీకరించాలి, కాదనుకుంటే తాను అప్పుడు ఎందుకు వచ్చారో చెప్పాలి,” అని రమేష్ డిమాండ్ చేశారు.

ఇక ఇటీవల కేటీఆర్ తీరుపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ,టీడీపీ పొత్తు గురించి వస్తున్న సంకేతాలతో బీఆర్‌ఎస్ భయపడుతోందని, అందుకే కేటీఆర్ అడ్డగోలు ఆరోపణలకు దిగుతున్నారని ఆరోపించారు. “తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న లోన్లకు నాతో సంబంధమేంటి? నన్నెందుకు లాగుతున్నారు?” అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేసినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్.. చిలుక సత్యం సాగర్ ని సన్మానించిన బీసీ సమాజ్..
మేడ్చల్, తెలంగాణ ముచ్చట్లు: జాతీయ మానవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్  ఎన్నికైన సందర్భంగా మంగళ...
జాతీయ మానవ హక్కులు , సామాజిక న్యాయ సంఘం వనపర్తి జిల్లా చైర్మన్ గా చిలుక సత్యం సాగర్
బిగ్ యూత్ అసోసియేషన్ పలహార బండి ఊరేగింపు 
కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమతో బిసి రిజర్వేషన్ నిరసనలు  
క్రీడాకారుల కోచ్ లకు ప్రోత్సాహం అందించండి బొంతు శ్రీదేవి యాదవ్
ప్రపంచ శాంతి సంఘం ఆధ్వర్యంలో హీరోషిమా డే సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవం
పాత‌ కూర‌గాయ‌ల మార్కెట్‌కు రూ.55 ల‌క్ష‌ల నిధులు నిధులు మంజూరు