ఎదులాబాద్‌లో ప్రపంచ వికలాంగ దినోత్సవ వేడుకలు

ఎదులాబాద్‌లో ప్రపంచ వికలాంగ దినోత్సవ వేడుకలు

మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్,  డిసెంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు): 

ప్రపంచ వికలాంగ దినోత్సవం సందర్భంగా, ఎదులాబాద్ గ్రామంలోని మనో వికాస కేంద్రంలో  గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంలో “సామూహిక పురోగతిని ముందుకు తీసుకెళ్లి, వివిధ సామూహిక వికలాంగులతో కూడిన మిశ్రిత సమూహాలను ప్రోత్సహించడం” అనే జాతీయ థీమ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు.ఈకార్యక్రమంలో ఇప్పటికే ఉన్న వికలాంగుల సంఘాల సభ్యత్వాన్ని పెంచడం, యుడిఐడి కార్డులు అందించడం, విద్యా మరియు వృత్తి శిక్షణకు అవగాహన కల్పించడం, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు, బ్యాంక్ లింక్ మరియు అప్పుల అవకాశాలపై వివరాలు ఇచ్చే కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.అలాగే, దివ్యాంగులతో క్రీడలు, పాటలు, ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైస్, రన్నింగ్ వంటి వినోద కార్యక్రమాలు, పిల్లల రక్షణ, పురోగతికి అవసరమైన చిట్కాలు పట్ల తల్లిదండ్రులతో చర్చలు కూడా జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా దివ్యాంగుల సామాజిక చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈకార్యక్రమంలో జిల్లా సమితి అధ్యక్షురాలు ఎ లలిత, కార్యదర్శులు నిర్మల, కవిత, డిపిఎంలు ఆనంద్, వినత, శ్రీనివాస్, ఏపిఎం మునిస్వామి, మనో వికాస కేంద్రం సిసి శంకర్, హరినాథ్, అంపయ్య, అలాగే వికలాంగ సంఘాలు రవికుమార్, స్పీచ్ థెరపిస్టులు కవిత, భార్గవి, రచనీ తదితరులు పాల్గొన్నారుIMG-20251206-WA0086.ప్రతి ఒక్కరికీ ప్రసంగాలు, గుర్తింపులు మరియు శుభాకాంక్షలు అందజేయడం ద్వారా ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .