ఎదులాబాద్లో ప్రపంచ వికలాంగ దినోత్సవ వేడుకలు
మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 06 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రపంచ వికలాంగ దినోత్సవం సందర్భంగా, ఎదులాబాద్ గ్రామంలోని మనో వికాస కేంద్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంలో “సామూహిక పురోగతిని ముందుకు తీసుకెళ్లి, వివిధ సామూహిక వికలాంగులతో కూడిన మిశ్రిత సమూహాలను ప్రోత్సహించడం” అనే జాతీయ థీమ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు.ఈకార్యక్రమంలో ఇప్పటికే ఉన్న వికలాంగుల సంఘాల సభ్యత్వాన్ని పెంచడం, యుడిఐడి కార్డులు అందించడం, విద్యా మరియు వృత్తి శిక్షణకు అవగాహన కల్పించడం, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు, బ్యాంక్ లింక్ మరియు అప్పుల అవకాశాలపై వివరాలు ఇచ్చే కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.అలాగే, దివ్యాంగులతో క్రీడలు, పాటలు, ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైస్, రన్నింగ్ వంటి వినోద కార్యక్రమాలు, పిల్లల రక్షణ, పురోగతికి అవసరమైన చిట్కాలు పట్ల తల్లిదండ్రులతో చర్చలు కూడా జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా దివ్యాంగుల సామాజిక చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈకార్యక్రమంలో జిల్లా సమితి అధ్యక్షురాలు ఎ లలిత, కార్యదర్శులు నిర్మల, కవిత, డిపిఎంలు ఆనంద్, వినత, శ్రీనివాస్, ఏపిఎం మునిస్వామి, మనో వికాస కేంద్రం సిసి శంకర్, హరినాథ్, అంపయ్య, అలాగే వికలాంగ సంఘాలు రవికుమార్, స్పీచ్ థెరపిస్టులు కవిత, భార్గవి, రచనీ తదితరులు పాల్గొన్నారు
.ప్రతి ఒక్కరికీ ప్రసంగాలు, గుర్తింపులు మరియు శుభాకాంక్షలు అందజేయడం ద్వారా ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది.


Comments