రైతే రాజట

రైతే రాజట

రైతే రాజట"

నీ నోటిన దేశం 
అప్పుల మట్టి కొట్టిన

ఆ మట్టి పొరనుండి మెతుకుగా మారి 
దేశ తనువుకు ప్రాణ భిక్షమెట్టిన త్యాగం నీది. 

నీ శ్రమ కిలో "రూపాయేనని"
అంగళ్లలో గుండెలపై గుద్ది పంపినా

మళ్ళీ మన్నును
ముద్దాడి దున్ని

ఎద విరుచుకుని 
"అన్నదాతగా" 
జాతిని నిలిపిన ధైర్యం నీది

నువ్వే రాజనే మాటల కోటపై మరో యుగమన్నా నిను కూర్చుండబెట్టి

పట్టాభిషేకాన్ని పొడిగించేసే 
పన్నాగమేసిన ప్రజాస్వామ్యమిది

ఆత్మ గౌరవమనే 
నీ పిడికిడి పొట్టకు
పలు తరాలుగా
పస్తులు పెట్టి 

దళారీ నక్కల 
"దోపిడీ పంటలు"
ఏపుగా పండే 
రైతు సుభిక్ష రాజ్యమిది.


✍️రచయిత :

నేపా.సంతోష్ అచ్యుత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాళోజి ప్రతిభ పురస్కార గ్రహీత,విజయవాడ,
8639442397.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .