అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం

అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం

కొత్తకోట,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు):

కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీవాసులు తమ గ్రామ శివారులోని సర్వే నంబర్లు 370, 371లో ఉన్న ప్రభుత్వ స్థలంలో అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని బుధవారం తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్లలో ఇప్పటికే శ్రీకృష్ణ దేవాలయం, మదర్ థెరిస్సా కమిటీ హాల్, 10 మంది జర్నలిస్టులకు, ఉద్యమకారుడు మహేష్‌కు, వాల్మీకి దేవాలయానికి స్థలాలు కేటాయించారని. మిగిలిన భూమిలో అంబేద్కర్ కళాభవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.
అలాగే మా గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని గ్రామ అభివృద్ధికి మాత్రమే వినియోగించాలనీ, ఆ గ్రామానికి సంబంధం లేని వారికి స్థలాలను కేటాయించకూడదని డిమాండ్ చేశారు. “భవిష్యత్తులో గ్రామానికి అవసరమైన స్థలం లేకుండా పోకుండా ప్రస్తుత ప్రభుత్వ భూమిని భద్రపరచాలి” అని గ్రామస్థులు తహసీల్దార్‌కు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నాగన్న, ప్రభుదాస్, పెద్ద కుర్మయ్య, బోజ్జన్న, ధనుష్, డీకే లక్ష్మణ్, జంగిడి రాజు, దామోదర్, రవి తదితరులు పాల్గొన్నారు.

 

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .