మౌలాలి చౌరస్తా వద్ద ఈద్-ఎ-మిలాద్ ఉన్ నబి సందర్భంగా శోభయాత్ర, షర్బత్  పంపిణీ 

మౌలాలి చౌరస్తా వద్ద ఈద్-ఎ-మిలాద్ ఉన్ నబి సందర్భంగా శోభయాత్ర, షర్బత్  పంపిణీ 

మౌలాలి, సెప్టెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్గిరి నియోజకవర్గం 138 మౌలాలి డివిజన్ లో ఎం.జె. కాలనీ పరిధిలోని మజీద్-ఎ-మహమ్మదీయ బేగం ఆధ్వర్యంలో ఈద్-ఎ-మిలాద్ ఉన్ నబి సందర్భంగా శోభాయాత్ర  ఆదివారం ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మౌలాలి చౌరస్తా వద్ద ప్రతి సంవత్సరం మాదిరిగానే భక్తులు, ప్రజలకు ఉచితంగా షర్బత్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
గత 12 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం స్థానికుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా మారిందిWhatsApp Image 2025-09-14 at 6.51.38 PMచిన్నారులు, యువత, వృద్ధులు అందరూ సమానంగా పాల్గొని జులూస్ కు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చారు.ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా 138వ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షకీల్ హాజరై ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిర్వాహకులుగా నజీర్ ఖాన్, అబ్బాస్, ఐజాజ్ సామీ, షాకీర్ బాబా, మెహబూబ్, ఇంతియాజ్ అహ్మద్, అస్లాం తదితరులు బాధ్యతలు స్వీకరించారు.ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఐక్యత, సోదరభావానికి నిదర్శనంగా ఈ వేడుకను విజయవంతం చేశారు. స్థానిక మత పెద్దలు కూడా ఈ సందర్భంగా మతసౌహార్ధం, శాంతి, ఐక్యత ప్రాధాన్యతను గుర్తుచేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .