హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన

హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన

నాచారం, సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు)

దేశభక్తి, జాతీయ సమైక్యత భావాల పెంపొందనకు ప్రతిరోజూ జాతీయ గీతాన్ని ఆలపించడం ఎంతో ప్రాముఖ్యమైందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.నాచారం డివిజన్ పరిధిలోని హెచ్‌.యం.టి. నగర్ హెచ్‌.యం.డి.ఏ పార్క్‌లో హెచ్‌.యం.టి. నగర్ ఫ్రెండ్స్ టీమ్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం 7.45 గంటలకు జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని బుధవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. జాతీయ గీతాలాపన ఒక క్రమశిక్షణ, దేశభక్తి, ఐక్యతకు ప్రతీక అని, చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ: స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం మనకు లభించిందంటే అది త్యాగాల ఫలితమని, ప్రతిరోజూ జాతీయ గీతాన్ని పాడడం ద్వారా ఆ త్యాగాలను గుర్తుచేసుకోవడం సమాజంలో అవగాహన పెంచుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు సుమన్, స్థానిక కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్, గీత ప్రవీణ్ ముదిరాజ్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎం.బి.సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడురి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, హెచ్‌.యం.టి. నగర్ వాసులు భారీగా హాజరయ్యారు.పిల్లలు, యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొనడంతో ఈ పార్క్ దేశభక్తి నినాదాలతో మారుమ్రోగింది. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజూ కొనసాగించేందుకు సంకల్పించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .