స్వయం ఉపాధినీ ఎంచుకొని జీవితంలో ఎదగాలి
వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి
పెద్దమందడి,సెప్టెంబర్14(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు న్యూ ఎస్సీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన టీ స్టాల్ను ఆదివారం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయం ఉపాధి వైపు దృష్టి సారించాలని, తమ నైపుణ్యాలు, శ్రమను వినియోగించి జీవితంలో ఎదగాలని పిలుపునిచ్చారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబనతో పాటు సమాజంలో గౌరవం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు
ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుర్వ భాలచంద్రయ్య, జి. చంద్రశేఖర్ రెడ్డి (ఇందిరమ్మ కమిటీ సభ్యులు), దిండు రవీందర్ (వార్డు సభ్యులు), మల్లికార్జున్ (మాజీ ఉప సర్పంచ్), జి. ఆంజనేయులు (ఇందిరమ్మ కమిటీ సభ్యులు), వడ్డే శేఖర్ (ఇందిరమ్మ కమిటీ సభ్యులు), ఐ. సుదర్శన్ రావు (అధ్యాపకులు), పి. సత్యన్న, సుద్దబాయి రాజు, డి. జయరాజు, కావలి రాజు, నాగభూషణ్, కె. కొండన్న, పి. రాములు, ఎ. రాములు, దయ్యాల శేఖర్, ఖాజా హుస్సేన్, కొత్త బాలస్వామి, బీరప్ప తదితరులు, కాలనీవాసులు పాల్గొన్నారు.


Comments