జిల్లా అధ్యక్షుడిగా బరిగెల ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక.
హసన్ పర్తి, సెప్టెంబర్ 15 ( తెలంగాణ ముచ్చట్లు):
మాదిగ హక్కుల పరిరక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా బరిగె ల ప్రకాష్ నియామక పత్రాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మైస ఉపేందర్ మాట్లాడుతూ మాదిగ హక్కుల పరిరక్షణ సమితి సంఘం బలోపేతంలో భాగంగా అన్ని జిల్లాలలో నూతన కమిటీలు పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేవెళ్ల అంబేద్కర్ అభయ హస్తం ద్వారా 12 లక్షలు దళితులకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బరిగెల ప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో సంఘ నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు వ్యవస్థాప అధ్యక్షునికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంద ఆరోగ్యం, బైరపాక జోజి తదితరులు పాల్గొన్నారు.
Comments