భద్రాద్రి కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అవసరం

భద్రాద్రి కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అవసరం

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై చర్చించేందుకు కలిసారు.

ఇప్పటికే ఒక స్థలంలో ఫీజిబిలిటీ సర్వే పూర్తి అయినప్పటికీ, అనుకూల ఫలితాలు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో స్థలాన్ని ప్రతిపాదించింది. తుమ్మల నాగేశ్వరరావు స్థానిక వాతావరణం, భౌగోళిక పరిస్థితులు పరిశీలించి, త్వరితగతిన సర్వే పూర్తిచేసి ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి చర్యలు ప్రారంభించాలని కోరారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, “దక్షిణ అయోధ్య”గా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయానికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు రాకపోకలు సులభం అవుతాయని, సింగరేణి గనులు, హెవీ వాటర్ ప్లాంట్, ఐటీసీ–బీపీల్ వంటి పరిశ్రమలు, అరుదైన ఖనిజ సంపద, ఎకో టూరిజం కేంద్రాలతో జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందిందని తుమ్మల గుర్తుచేశారు.

తుమ్మల నాగేశ్వరరావు “తెలుగు బిడ్డ రాంమోహన్ నాయుడు చొరవతో కొత్తగూడెం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కల త్వరలోనే సాకారం అవుతుంది. ఈ ప్రాజెక్ట్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది” అని స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు తాటికాయలలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
  ధర్మసాగర్,సెప్టెంబర్17(తెలంగాణ ముచ్చట్లు): ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో బిజెపి గ్రామ శాఖా అధ్యక్షులు పెసరు వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా
అంబేద్కర్ కళాభవనానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం
పెద్దమందడిలో బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం 
హెచ్‌.యం.టి. నగర్‌లో ప్రతిరోజూ జాతీయ గీతాలాపన
అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?