వనపర్తి విద్యార్థినికి రాష్ట్రస్థాయి గౌరవం

పిజి ప్రవేశ పరీక్షలో పదవ ర్యాంకు సాధించిన నందిపేట గీత

వనపర్తి విద్యార్థినికి రాష్ట్రస్థాయి గౌరవం

వనపర్తి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన నందిపేట గీత రాష్ట్ర స్థాయి తెలంగాణ సాధారణ పిజి ప్రవేశ పరీక్ష–2025 లో ప్రతిభ కనబరచి పదవ ర్యాంకు సాధించింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలో గీత సామాజశాస్త్రం విభాగంలో ఉత్తమ మార్కులు సాధించి అర్హత పొందింది. సాధారణ కుటుంబానికి చెందిన ఆమె తండ్రి నందిపేట రాములు ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
ఈ విజయంతో గీత తన కుటుంబానికే కాకుండా, గ్రామానికి, వనపర్తి జిల్లాకే గర్వకారణంగా నిలిచింది.
ఆమె విజయంపై బంధుమిత్రులు, అధ్యాపకులు, గ్రామ పెద్దలు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .