వనపర్తి విద్యార్థినికి రాష్ట్రస్థాయి గౌరవం
పిజి ప్రవేశ పరీక్షలో పదవ ర్యాంకు సాధించిన నందిపేట గీత
Views: 18
On
వనపర్తి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన నందిపేట గీత రాష్ట్ర స్థాయి తెలంగాణ సాధారణ పిజి ప్రవేశ పరీక్ష–2025 లో ప్రతిభ కనబరచి పదవ ర్యాంకు సాధించింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలో గీత సామాజశాస్త్రం విభాగంలో ఉత్తమ మార్కులు సాధించి అర్హత పొందింది. సాధారణ కుటుంబానికి చెందిన ఆమె తండ్రి నందిపేట రాములు ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
ఈ విజయంతో గీత తన కుటుంబానికే కాకుండా, గ్రామానికి, వనపర్తి జిల్లాకే గర్వకారణంగా నిలిచింది.
ఆమె విజయంపై బంధుమిత్రులు, అధ్యాపకులు, గ్రామ పెద్దలు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments