పెన్షన్ పెంచకపోతే ఉద్యమం తీవ్రతరం

మల్కాజిగిరి తహసిల్దార్ కార్యాలయ ముట్టడి చేసిన వికలాంగులు, సంఘ నాయకులు

పెన్షన్ పెంచకపోతే ఉద్యమం తీవ్రతరం

మల్కాజిగిరి, సెప్టెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు)

రాష్ట్రంలో పెన్షన్‌దారులు, వికలాంగులు ఎదురు చూస్తున్న పెన్షన్ వృద్ధి కోసం పోరాటం ముదురుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన హామీలను అమలు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగులు సోమవారం మల్కాజిగిరి తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు."హామీ నెరవేర్చాలి – పెన్షన్ పెంచాలి" అంటూ నినాదాలు చేసిన నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.WhatsApp Image 2025-09-15 at 6.28.13 PM
వీహెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ మాట్లాడుతూ ఎన్నికల ముందు వికలాంగులకు 4 వేల నుండి 6 వేల, సాధారణ పెన్షన్‌ దారులకు 2 వేల నుండి 4 వేల పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అధికారం లోకి వచ్చి 20 నెలలు గడిచినా మాట నిలబెట్టుకోలేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం” అని విమర్శించారు.ఇకపై హామీ అమలు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రజల జీవనాధారం అయిన పెన్షన్ పెంపు సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .