వనపర్తి జర్నలిస్టుల నిరసన

జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి – కలెక్టర్‌కు వినతి

వనపర్తి జర్నలిస్టుల నిరసన

వనపర్తి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):

జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టిన జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతిపత్రాన్ని అందజేశారు.
జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు బక్షి శ్రీధర్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపు మేరకు ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు. రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వార్తగా ప్రసారం చేసినందుకు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో టీ న్యూస్ బ్యూరో చీఫ్ సాంబశివరావుపై ఉద్దేశపూర్వకంగా నాన్-బేయిలబుల్ కేసు నమోదు చేయడం నిరసనకు కారణమని ఆయన తెలిపారు.WhatsApp Image 2025-09-15 at 3.48.35 PM
జర్నలిస్టులు మాట్లాడుతూ, రైతుల సమస్యలపై రాసిన వార్తలకుగాను మీడియాపై అక్రమ కేసులు నమోదు చేయడం మానవ హక్కులకు విరుద్ధమని, కుట్రపూరితంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, ఆనంద్, సుంకరి నగేష్, జగత్ పల్లి శ్రీనివాస్, రాజు, జానీ, సుంకరి రమేష్, గోవర్ధన్, మన్నాజీ, భాను ప్రకాష్, అశోక్, ఈశ్వర్, గోపాల్, చెన్నయ్య, రాధాకృష్ణరెడ్డి, రాములు, అబ్దుల్ హమీద్, ఖలీల్, శ్రీకాంత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .