వెల్టూర్ చెరువు సుందరీకరణ వృథా

మందుబాబులకు అడ్డాగా మారిన వెల్టూర్ చెరువు కట్ట

వెల్టూర్ చెరువు సుందరీకరణ వృథా

 చెరువు కట్టపై 62 సోలార్ లైట్లు ధ్వంసం, గ్రామస్తులు ఆగ్రహం

పెద్దమందడి,సెప్టెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలోని గోపాల సముద్రం చెరువు ఇటీవల పునర్నిర్మాణం చేసి, చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ తరహాలో తీర్చిదిద్దారు. చెరువు సుందరీకరణలో భాగంగా కట్టకు ఇరువైపులా సోలార్ లైట్లు అమర్చి ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన చెరువు కట్ట గ్రామానికి ఆహ్లాదకర వాతావరణాన్ని తీసుకువచ్చింది.
అయితే, ఈ అందాలను కాపాడుకోవాల్సిన బదులు చెరువు కట్ట మందుబాబులకు అడ్డాగా మారింది. గుర్తు తెలియని వ్యక్తులు చెరువు కట్టకు ఇరువైపులా అమర్చిన 62 సోలార్ లైట్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"WhatsApp Image 2025-09-15 at 5.58.11 PM (1)చెరువు కట్ట దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి సంఘటనలుజరగవు," అని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి గ్రామస్తుడి బాధ్యత అని, సుందరీకరణ కోసం ఖర్చు చేసిన నిధులు వృథా కావడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
"మన ఊరు – మన ప్రదేశం – మన ప్రకృతి"ని సంరక్షించుకోవాలని, ఇటువంటి ధ్వంసకర చర్యలను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .