ఘనంగా ప్రధాని మోడీ 75వ జన్మదిన వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీలో 

ఘనంగా ప్రధాని మోడీ 75వ జన్మదిన వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీలో 

తార్నాక , సెప్టెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల ముందు విద్యార్థి నాయకులు జాడీ రమేష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ హాజరై విద్యార్థులతో కలిసి జన్మదిన కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. విద్యార్థులు "లాంగ్ లివ్ నరేంద్ర మోడీ జీ" అంటూ నినాదాలతో కార్యక్రమాన్ని సందడిగా మార్చారు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు జాడీ రమేష్ మాట్లాడుతూ :వికసిత్ భారత్ లక్ష్యంతో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రాత్రింబగళ్లు కృషి చేస్తున్నారని.జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపుతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన మేలు జరుగుతోందని. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి కొనసాగిస్తున్నారని తెలిపారు.అలాగే దేశ ప్రధానిగా రికార్డు సృష్టించడమే కాకుండా అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను పెంపొందించడంలో నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన గ్లోబల్ లీడర్‌గా పేరు సంపాదించడం భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు వినోద్ నునావత్, చరణ్, సుధాకర్, ఇక్షిత్, అనిత ముదిరాజ్, డా. కతరసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .