అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?

విలేకరుల సమావేశంలో న్యాయం చేయాలని వేడుకున్న మాజీ సర్పంచ్

అక్రమసంబంధం కోసమే సుఫారీ పేరుతో జైలుకు...?

ఖమ్మం బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 17, తెలంగాణ ముచ్చట్లు;

 వివాహేతర సంబంధం కోసమే అడ్డు తొలగించుకునేందుకు సుఫారీ సృష్టించి అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపారని ముదిగొండ మండలం సువర్ణపురానికి చెందిన తోట మౌనిక ఆరోపించింది. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తోట మౌనిక తన తండ్రితో కలిసి మాట్లాడుతూ.. ముదిగొండ మండలం సువర్ణ పురం గ్రామానికి చెందిన తోట ధర్మారావుతో 15 సంవత్సరముల క్రితం వివాహం జరిగి ఇద్దరు కుమారులని తెలిపింది. మొదటి నుండి తన భర్త అనుమానం వ్యక్తం చేసేవాడని ఎవరితో మాట్లాడిన అక్రమ సంబంధం అంతకట్టేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి చుట్టూ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటుచేశాడని పేర్కొంది. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని తెలిపింది. తనను అడ్డు తొలగించుకునేందుకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సృష్టించి సుపారి మర్డర్ ప్లాన్ చేసుకొని, ఇటు మా తల్లిగారి ఊరు, అటు అత్తగారు ఊరు కాకుండా ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ పేరుతో పిలిపించి తనకు తెలియకుండానే జైలుకు పంపారని ఆరోపించింది. జైలు నుండి వచ్చిన తర్వాత ఇంటికి, తన ఫోనుకు ఉన్న సీసీటీవీ అనుసంధానం వలన వారి అక్రమ సంబంధం బయటపడిందని తెలిపింది. ఇట్టి విషయమై ముదిగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని తెలిపింది తనతో వివాహం జరిగి వేరే మహిళలతో అక్రమ సంబంధం, తన పెద్ద కుమారుడిని చూడనీయకుండా వేదనకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసు అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని వేడుకుంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .