గద్వాల కృష్ణకు ఘన సన్మానం.
వనపర్తి,సెప్టెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ కోర్ కమిటీ సభ్యుడిగా నియమితులైన గద్వాల కృష్ణను వనపర్తి జిల్లా ఎస్టీ, ఎస్సీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం గద్వాల కృష్ణ చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా చింతకుంట విద్యాబాబు, బోజి రాజు, గద్వాల వెంకటేష్, యాదవల్లి వీరప్ప, రామచంద్రయ్య, డి. వెంకటేష్ తదితరులు మాట్లాడుతూ.. గద్వాల కృష్ణ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ సాధనతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, వేతనాలు, పేదలకు పింఛన్ల వంటి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.అనంతరం గద్వాల కృష్ణ మాట్లాడుతూ.. తనను సన్మానించి అభినందించిన జిల్లా ఎస్టీ, ఎస్సీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. బాధితుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి కొనసాగిస్తానని తెలిపారు.


Comments