ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన.

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన.

చిల్పూర్, సెప్టెంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు): 

సికింద్రాబాద్‌ ఈస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన ప్రముఖ పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం చిల్పూర్‌ గ్రామ పంచాయతీ ఆవరణలో ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఉప సర్పంచ్‌ రాజారపు రంజిత్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది.శిబిరంలో వృద్ధులు, మహిళలతో పాటు 100 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కంటి శస్త్రచికిత్స అవసరమైన అర్హులకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులు అందజేస్తామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గతంలో కూడా చిల్పూర్‌ గ్రామంలో 180 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఉప సర్పంచ్‌ రాజారపు రంజిత్‌ మాట్లాడుతూ పేద ప్రజలకు కంటి చూపును మెరుగుపరిచేందుకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న పుష్పగిరి కంటి ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని నిర్వహించేందుకు కృషి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప వార్డు సభ్యుడు మహ్మద్‌ షకీల్‌, దేవస్థానం డైరెక్టర్‌ గణగోని రమేష్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన. నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన.
* నాయిని చెరువును పరిశీలించిన పోలీస్ కమిషనర్ గౌస్ అలాం * మూడు క్రేన్లతో నిమజ్జన ప్రక్రియకు ఏర్పాట్లు జమ్మికుంట, సెప్టెంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట...
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు బీఆర్‌ఎస్‌ నేతల వినతి.
ప్రజారోగ్యంపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి.
వెల్టూర్‌ అభివృద్ధిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ అభినందనీయం.
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల పరిశీలన.
గృహిణి మెడలో పుస్తెలతాడు చోరీ.
ప్రతిభకు దక్కిన గౌరవం.!