తెలంగాణ ముచ్చట్లు వార్తకు స్పందన.. కదిలిన అధికార యంత్రాంగం!.

తెలంగాణ ముచ్చట్లు వార్తకు స్పందన.. కదిలిన అధికార యంత్రాంగం!.

కృష్ణాజిగూడెం వార్డుల్లో మురుగునీటి సమస్యపై ఎంపీడీఓ సీరియస్

ఫాగింగ్, బ్లీచింగ్‌కు ఆదేశాలు.. డ్రైనేజీలకు అడ్డుకట్ట వేసేవారికి నోటీసులు

చిల్పూర్, సెప్టెంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు): 

మండలంలోని కృష్ణాజిగూడెం గ్రామంలోని 3, 4వ వార్డుల్లో మురుగునీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ తెలంగాణ ముచ్చట్లులో ప్రచురితమైన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది.వార్తపై స్పందించిన చిల్పూర్ ఇన్‌చార్జి ఎంపీడీఓ కిరణ్ ప్రసాద్, సర్పంచ్ మల్లం రవీందర్‌తో కలిసి శుక్రవారం కృష్ణాజిగూడెం గ్రామంలోని ఆయా కాలనీల్లో పర్యటించారు. మురుగునీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. సమస్యలపై పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించి, తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కాలనీల్లో వెంటనే పొగమందు పిచికారీ చేయించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీ కాలువల్లో బ్లీచింగ్‌ పొడి చల్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. నిలిచిపోయిన మురుగునీటిని తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.అలాగే డ్రైనేజీ కాలువలకు అడ్డుకట్టలు వేసిన వారిని, ఇళ్ల నిర్మాణ వ్యర్థాలతో కాలువలను పూడ్చిన వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. కాలనీలో అవసరమైన విద్యుత్‌ స్తంభాల ఏర్పాటుపై విద్యుత్‌ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎంపీడీఓ తెలిపారు.అధికార యంత్రాంగం స్పందించి కాలనీలో పర్యటించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన తెలంగాణ ముచ్చట్లు పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ పర్యటనలో పంచాయతీ కార్యదర్శి జేస్మని, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన. నాయిని చెరువులో గణేష్ నిమజ్జనానికి పరశీలన.
* నాయిని చెరువును పరిశీలించిన పోలీస్ కమిషనర్ గౌస్ అలాం * మూడు క్రేన్లతో నిమజ్జన ప్రక్రియకు ఏర్పాట్లు జమ్మికుంట, సెప్టెంబర్ 8 (తెలంగాణ ముచ్చట్లు): జమ్మికుంట...
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు బీఆర్‌ఎస్‌ నేతల వినతి.
ప్రజారోగ్యంపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి.
వెల్టూర్‌ అభివృద్ధిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక శ్రద్ధ అభినందనీయం.
వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల పరిశీలన.
గృహిణి మెడలో పుస్తెలతాడు చోరీ.
ప్రతిభకు దక్కిన గౌరవం.!