గురువులే భావితరాలకు దిక్సూచి.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా గ్రంథాలయంలో సత్తు మల్లేశం నివాళి.
Views: 0
On
కరీంనగర్, సెప్టెంబర్ 5(తెలంగాణ ముచ్చట్లు ):
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా గ్రంథాలయంలో భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర అమూల్యమని, సమాజ అభివృద్ధికి విద్యే పునాది అన్నారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
“గురువు చూపే మార్గం.. విద్యార్థి జీవితానికి వెలుగుబాట” అని సత్తు మల్లేశం పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 Sep 2026 20:20:55
*టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ రాష్ట్ర కార్యదర్శి బొల్లి వెంకటరాజు*
*సీనియర్ రిపోర్టర్ అనిల్ రెడ్డి ని పరామర్శించిన వెంకట్ రాజు అన్నెం సత్యాలు*
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్...


Comments