కరీంనగర్లో వినాయక మండపాలను సందర్శించిన బండి సంజయ్.
*గణనాథుడికి ప్రత్యేక పూజలు*
*ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్ష*
కరీంనగర్, సెప్టెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు ):
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ నగరంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, దేశం, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని బండి సంజయ్ ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని భక్తులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పలువురు బీజేపీ స్థానిక ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.


Comments