చిలుకటోనీ పల్లి అభివృద్ధే లక్ష్యం… సర్పంచ్ అభ్యర్థి పద్మా లింగేశ్వర్

చిలుకటోనీ పల్లి అభివృద్ధే లక్ష్యం… సర్పంచ్ అభ్యర్థి పద్మా లింగేశ్వర్

దూకుడుగా ప్రచారం ఫుట్‌బాల్ గుర్తుకు ఊహించని ప్రజాదరణ

ఎమ్మెల్యే సహకారంతో విజయం సాధిస్తా..

పెద్దమంద,డిసెంబర్07(తెలంగాణ ముచ్చట్లు):

చిలుకటోనీ పల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. అభ్యర్థి పద్మా లింగేశ్వర్ ఇంటింటి ప్రచారంతో దూకుడు పెంచి ప్రజల మధ్య విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతున్నారు. ఆదివారం వెల్టూర్ గ్రామంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డిని కలిశారు. ఇంటింటా ప్రచారంలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పద్మలింగేశ్వర్ కు ఎమ్మెల్యే సూచించారు. గ్రామాభివృద్ధిని ప్రధాన అజెండాగా తీసుకున్న పద్మా లింగేశ్వర్, ఫుట్‌బాల్ గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులను కోరుతున్నారు.ప్రచారానికి ఊహించని విధంగా వచ్చిన ప్రజాదరణతో పద్మా లింగేశ్వర్ హుషారులో ఉన్నారు. ప్రతి గడప వద్ద ప్రజలు చూపుతున్న ఆదరణ, విశ్వాసం తనకు గెలుపు సంకేతాలు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించే దిశగా పనిచేయాలని సంకల్పం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే మేఘా రెడ్డి అండగా ఉన్నందున విజయం తనవైపే అని ధీమా వ్యక్తం చేశారు.చీలకటోనీ పల్లిలో ఎన్నికల వేడి పెరగడంతో ప్రచార రంగంలో పద్మా లింగేశ్వర్ పేరు పెనుమార్పులు తెస్తోంది. ప్రజల మద్దతుతో, ఎమ్మెల్యే మేఘా రెడ్డి సహకారంతో గెలుపు ఖాయం అని పద్మలింగేశ్వర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. IMG-20251207-WA0018

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .