ఖమ్మం–అశ్వారావుపేట రోడ్డుకు తక్షణ ఇంప్రూవ్మెంట్ అవసరం.!

నితిన్ గడ్కరికి లేఖ రాసిన మంత్రి తుమ్మల. - సానుకూలంగా స్పందించిన కేంద్రం.

ఖమ్మం–అశ్వారావుపేట రోడ్డుకు తక్షణ ఇంప్రూవ్మెంట్ అవసరం.!

సత్తుపల్లి, నవంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

ఖమ్మం–అశ్వారావుపేట జాతీయ రహదారిపై పెరుగుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర రహదారి రవాణా & హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. అనంతరం ఫోన్‌లో మాట్లాడి, వర్షాల ప్రభావంతో రహదారి తీవ్రంగా దెబ్బతిని గుంతలు ఏర్పడటం వల్ల ప్రయాణికులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను కేంద్రానికి వివరించారు. ఈ నేపథ్యంలో రహదారిపై వెంటనే వన్ టైం ఇంప్రూవ్మెంట్ పనులు చేపట్టాలని కోరారు. ఈ రహదారి ఎన్ హెచ్–365బిబి లో భాగమై, రాబోయే ఎన్ హెచ్–365బిజి గ్రీన్‌ఫీల్డ్ హైవే అనుసంధానంలో కీలక పాత్ర పోషించనుందని తుమ్మల గుర్తుచేశారు. హైదరాబాద్–ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణించే వాహనాలు గణనీయంగా ఈ రహదారినే ఉపయోగిస్తుండటం, అలాగే కాకినాడ–వైజాగ్ పోర్టులకు వెళ్లే భారీ రవాణా కూడా ఇదే మార్గం మీద ఆధారపడటం వల్ల ఈ రహదారి ప్రాధాన్యం మరింతగా పెరిగినట్లు పేర్కొన్నారు. నాలుగు లైన్లుగా విస్తరించేందుకు డిపిఆర్ సిద్ధం జరుగుతున్నప్పటికీ, ఆ పనులు మొదలయ్యే వరకు కనీసం సంవత్సరం సమయం పడుతుందని తుమ్మల తెలిపారు. ఈలోగా నిరంతర ప్యాచ్‌వర్క్ వల్ల రోడ్డుపై మరమ్మత్తులు నిలవకపోవడంతో ప్రయాణ సౌకర్యం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. బరువైన వాహనాల రాకపోక, నాసిరకం ఉపరితలం కారణంగా పరిస్థితి ప్రమాదకరంగా మారిందని, అందుకే ప్రస్తుత ఉపరితలాన్ని బలోపేతం చేస్తూ అత్యవసర పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించారు.

ఇదే సందర్బంగా జగ్గయ్యపేట–కొత్తగూడెం వయా వైరా మార్గాన్ని కొత్త జాతీయ రహదారిగా మంజూరు చేయాలని తుమ్మల మరో లేఖలో కోరారు. జాతీయ రహదారి 65 మరియు 30లను అనుసంధానించే ఈ మార్గానికి ఆమోదం లభిస్తే రెండు రాష్ట్రాల ప్రజలకు వేగవంతమైన, సురక్షిత రవాణా అందుబాటులోకి వస్తుందని ఆయన భావించారు. కొత్తగా జాతీయ రహదారిగా ప్రకటిస్తే భద్రాచలం వెళ్లే భక్తులకు కూడా ప్రయాణం సౌకర్యవంతం అవుతుందని వివరించారు. జగ్గయ్యపేట సిమెంట్ పరిశ్రమల నుంచి కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు పరిశ్రమల వరకు రవాణా కనెక్టివిటీ మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అదే విధంగా కొణిజర్ల, కల్లూరు మున్సిపాలిటీ, పెనుబల్లి, దమ్మపేట జంక్షన్లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నందున వాటిని ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని తుమ్మల గడ్కరీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాంతాల్లో నూతనంగా నాలుగు వరుసల రహదారి, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, డ్రైన్ల ఏర్పాట్లకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై ఎం ఓ ఆర్ టి హెచ్ రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్‌కూ వేరుగా లేఖ పంపినట్టు తెలిపారు.
జిల్లాలో రాకపోకల సౌలభ్యం, ప్రమాదాల నియంత్రణ, పరిశ్రమల కనెక్టివిటీ, భద్రాచలం దారిలో ప్రయాణించే ప్రజల భద్రత–జిల్లా కనెక్టివిటీ కోసం తక్షణ చర్యలు  తీసుకుని, ఈ ప్రతిపాదనలను అత్యవసరంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని తుమ్మల స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి  సానుకూలంగా స్పందించి త్వరలోనే చర్యలు ప్రారంభించేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .