కాలనీ సమస్యల పరిష్కారం కోరుతూ నివాసితుల నిరసన

కాలనీ సమస్యల పరిష్కారం కోరుతూ నివాసితుల నిరసన

మల్కాజిగిరి, సెప్టెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని మీర్జాలగూడ చిన్మయ మార్గ్ కాలనీ వాసులు ఆదివారం రోడ్డుపైకి వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టారు.నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం, హుడా మాస్టర్ ప్లాన్ ప్రకారం 66 అడుగులు ఉండాల్సిన రహదారి కేవలం 15 అడుగులకే పరిమితమైందని, దీంతో కాలనీలోకి అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వంటి అత్యవసర వాహనాలు ప్రవేశించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల నుండి వచ్చే మురుగునీరు ఇళ్లలోకి చేరి జీవనాన్ని దయనీయ స్థితికి నెడుతోందని, పలువురు ప్రమాదాలకు గురైన ఘటనలు చోటుచేసుకున్నాయని నివాసితులు తెలిపారు.వారికి అనుగుణంగా రెండు కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బాక్స్ డ్రైనేజ్ పనులు నాణ్యత లోపించి సక్రమంగా పనిచేయడం లేదని, ఫలితంగా సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారం కోసం కాలనీ వాసులు వెంకటేశ్వర స్వామి గుడి నుండి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంధ్య, ఉమామహేశ్వరి, శోభ, కొమరమ్మ, మధు నాయుడు, కరుణాకర్, బాలుజీ నాయక్, వెంకటేష్, అవినాష్ పుడి, విద్య, మహాలక్ష్మి, జంగాల శ్రీరామ్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ రహదారి విస్తరణ, మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని కోరారు.కాలనీ వ్యవస్థాపకుడు జంగాల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ – “ప్రభుత్వ ప్రతినిధులు కాలనీ సమస్యలపై చర్యలు తీసుకోకపోతే నిరవధిక దీక్షలు చేపట్టడం తప్పదని” తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .