రైల్వే  ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ షెడ్యూల్లో మార్పు.. పూర్తి వివరాలు ఇవే.

రైల్వే  ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ షెడ్యూల్లో మార్పు.. పూర్తి వివరాలు ఇవే.

విశాఖపట్నం - సికింద్రాబాద్ల మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పు చేయాలని నిర్ణయించారు. పెరుగుతున్న ప్రయాణ డిమాండ్కు అనుగుణంగా, ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ తెలిపింది. విశాఖపట్నం-సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెప్రెస్ (20833/20834) షెడ్యూల్లో స్వల్ప మార్పు చేయనున్నట్టుగా పేర్కొంది. ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు డిసెంబర్ 10 నుంచి ఆదివారం కాకుండా, మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుందని అధికారులు తెలిపారు.

అంటే డిసెంబర్ 10 నుంచి విశాఖపట్నం-సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ (20833/20834) మంగళవారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు రాకపోకలు సాగించనుంది. ఇక, సికింద్రాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ (20707 /20708) ప్రస్తుతం ఉన్నట్టుగానే గురువారం మినహా వారంలో మిగిలిన ఆరు రోజులు సేవలు అందించనుంది.

*వందేభారత్ ఎక్స్ప్రెస్..*

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .