ఏటీసీలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం
తెలంగాణ ముచ్చట్లు, మందమర్రి:-
ప్రస్తుత పారిశ్రామిక సంస్థలకు నైపుణ్య మానవ వనరులను అందించడమే లక్ష్యంగా, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా టాటా టెక్నాలజీ సహకారంతో నూతనంగా నిర్మించబడిన అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ)లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని పట్టణ ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ జి దేవానంద్ సోమవారం ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏటీసీ కేంద్రంలో ఆరు కోర్సులు నిర్వహిస్తుండగా, అందులో మూడు కోర్సులు ఒక సంవత్సరం కాలవ్యవధి, మిగిలిన మూడు కోర్సులు రెండు సంవత్సరాల కాలవ్యవధి కలిగి ఉన్నాయని తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 14 నుండి అక్టోబర్ 19 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఐటిఐ వెబ్సైట్ లో అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అనంతరం కళాశాల పని వేళలో కళాశాలలో సంప్రదించాలని తెలిపారు. జిల్లాలో 25 ఐటిఐ కళాశాలలు ఉండగా, కేవలం పట్టణ ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో మాత్రమే ఏటీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆసక్తి గల 10వ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనిసూచించారు.మరిన్నివివరాలకు7013846573, 9154549697,9885981959నెంబర్లనుసంప్రదించాలన్నారు.


Comments