అన్నదానం చేసిన ఆర్యవైశ్యులు

తెలంగాణ ముచ్చట్లు,జఫర్గడ్: మండల కేంద్రంలో బుధవారం మండల
ఆర్యవైశ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సంద్భంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు చిట్టిమళ్ళ కృష్ణమూర్తి, మండల సంఘం అధ్యక్షులు రేవూరి రమేష్ మాట్లాడుచూ..
నెలకు ఒకరోజు అమావాస్య పర్వదినము పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని
మండల ఆర్యవైశ్యులు నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు.
పోయిన నెలలో ప్రారంభమయిన ఈ పవిత్ర కార్యక్రమంను ఇకనుండి
ప్రతి నెలలో ఒకరోజు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బోనగిరి శ్రవణ్ కుమార్ కోశాధికారి రమేష్ టౌన్ అధ్యక్షులు అంచూరి యుగంధర్ దామిశెట్టి రామయ్య ఇమ్మడి అశోక్ పాలకుర్తి రాజయ్య దొడ్డ రాజ్ కుమార్ గందే సోమన్న దామిశెట్టి సోమేశ్వర్ బజ్జూరి మణికాంత్ బెల్దే హరి శంకర్ బజ్జూరి సంతోష్ బజ్జూరి సుధీర్ దొడ్డ రమేష్ అంచూరి శ్రీనివాస్ పట్టూరి శ్రీధర్ చందా సతీష్ బజ్జుర్ రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments