హాస్టల్‌లో ఉండాల్సిన బిడ్డ ఆస్పత్రిలో శవమైంది.. మిస్టరీగా మారిన బిటెక్‌ విద్యార్ధిని మృతి

హాస్టల్‌లో ఉండాల్సిన బిడ్డ ఆస్పత్రిలో శవమైంది.. మిస్టరీగా మారిన బిటెక్‌ విద్యార్ధిని మృతి

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

ఒంగోలులో బిటెక్‌ విద్యార్దిని అనుమానాస్పదమృతి మిస్టరీగా మారింది… తిరుపతి ఎస్‌వి యూనివర్సీటిలో ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్ధిని ఆమె స్వగ్రామం ఒంగోలులో శవమై తేలడంతో ఈ ఉదంతం కలకలం రేపింది. ఆమెను అపస్మారక స్తితిలో ఉండగా ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించిన ఐదుగురు యువకులు పరారయ్యారు. నోటి వెంట నురగలు కక్కుతూ చనిపోయిన స్థితిలో ఉన్న ఆ విద్యార్ధిని అప్పటికే ఆరు నెలల గర్భవతి ఉందని డాక్టర్లు గుర్తించడంతో ఆమె మృతిపై అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రి దగ్గర కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తిరుపతి హాస్టల్‌లో ఉండాల్సిన తమ బిడ్డ ఒంగోలు రిమ్స్‌లో శవమై ఎలా తేలిందని ప్రశ్నిస్తున్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .