స్కూల్లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుక
స్టేషన్ ఘనపూర్: తెలంగాణ ముచ్చట్లు
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలోని కొలంబో (సీబీఎస్సీఈ) స్కూల్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ తామస్ కిరణ్ విద్యార్థిని విద్యార్థులకు పేరెంట్స్ కి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం నందు డిగ్రీ మరియు పీజీ లకు హనుమకొండ పట్టణం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రహించిన కదలిక సంస్థ ఆనాడు విద్య జ్యోతి డిగ్రీ అండ్ పీజీ కళాశాలను ఏర్పాటు చేసి అతి తక్కువ ఫీజులతో సంస్థ నష్టాలు వచ్చినప్పటికీ సేవే ద్యేయంగా 30 సంవత్సరాల నుండి విద్యను అందించమన్నారు తర్వాతి రోజులకనుగుణంగా వచ్చిన మార్పుల వల్ల సీబీఎస్ ఈ స్కూల్ ఏర్పాటు చేయాలని స్టేషన్ ఘనాపూర్ ప్రజలకు సీబీఎస్ ఈ స్కూల్ ని ఈ సంవత్సరం ఏర్పాటు చేశామని అన్నారు. ప్రస్తుతానికి మూడవ తరగతి వరకు విద్యను అందిస్తున్నామన్నారు వచ్చే సంవత్సరం నుండి 5వ తరగతి నుండి ప్రతి సంవత్సరం ఒక క్లాస్ పెంచుకుంటూ టెన్త్ క్లాస్ వరకు విద్యను అందించబోతున్నామన్నారు, అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఫాదర్ అనిల్ (ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ విశ్వ జ్యోతి కళాశాల కరుణాపురం), విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Comments