ఎలాంటి కోచింగ్ లేకుండానే.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. కానీ నా లక్ష్యం ఇదే..

ఎలాంటి కోచింగ్ లేకుండానే.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. కానీ నా లక్ష్యం ఇదే..

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

ప్రస్తుతం పోటీరంగంలో ఒకే ఒక్క ఉద్యోగం సాధించాలంటే.. ఎంతో కష్టపడాలి. అది కూడా వస్తుందని గ్యారెంటీ లేదు. కానీ ఈ యుమతి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనేలా చేసింది.

ఈమే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చిన్నబుగ్గారం గ్రామానికి చెందిన కేతావత్ నిఖిత. ఈ నేపథ్యంలో కేతావత్ నిఖిత సక్సెస్ స్టోరీ మీ కోసం..కుటుంబ నేపథ్యం :

నిఖిత.. తండ్రి సర్దార్ సింగ్. ఈయన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. తన కూతురు ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నిఖిత.. తన పాఠశాల విద్యను మంచిర్యాలలోని ప్రైవేట్ పాఠశాలలో చదివింది. ఆ తరువాత మెదక్ లోని మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ పూర్తి చేసింది. మళ్లీ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచే.. ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..

నేను 2023లో నా చదువు పూర్తి అయినా వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాను. నేను ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యాను. ఇటీవలే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించిన ఫలితాల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సంపాదించాను. అలాగే గ్రూప్-4 ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాను. ఇవే కాకుండా రెసిడెన్షియల్ స్కూలులో టీచర్ , జూనియర్ లెక్చరర్గా, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా, అలాగే PGT టీచర్గా నూ ఎంపికయ్యాను.



Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .