స్మార్ట్ కిడ్జ్ లో ఉత్సాహంగా రక్షాబంధన్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో సోమవారం రక్షాబంధన్ వేడుకలు ఆనందోత్సవాలలో జరిగాయి. సోదర ప్రేమకు ప్రతీకంగా నిలిచిన రాఖీ పౌర్ణమి ఉత్సాహాన్ని పాఠశాల చిన్నారులు సంబరంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థినీలు తమ తరగతిలోని విద్యార్థులకు రక్షణ కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. అబ్బాయిల ముంజేతికి అమ్మాయిలు రాఖీ కట్టి మిఠాయి తినిపించి తమ సోదర ప్రేమను చాటి చెప్పారు. రాఖీ పౌర్ణమి వేడుకలలో పాఠశాలలో సంబరాలు వెల్లి విరిసాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ అనంతమైన సహోదర ప్రేమకు రక్షాబంధన్ దర్పణంగా నిలుస్తుందని అన్నారు .చిన్నారుల్లో రక్షాబంధన్ విశిష్టతను తెలియజేసేందుకు తమ పాఠశాలలో ఈ వేడుకలను నిర్వహించాము అన్నారు. నైతిక విలువలతో కూడిన విద్యను అందించి మన విద్యార్థుల్లో సోదరభావం పెంపొంది తోటి వారి పట్ల గౌరవం పెరిగి అందరము సమానమనే భావన వెల్లి విరుస్తుందని తెలియజేశారు. తద్వారా సమాజంలో వికృతి భావనలు తొలిగిపోయి ప్రతి ఒక్కరికి రక్షణ కవచంగా నిలవాలని భావన పెరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపాల్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


Comments