స్మార్ట్ కిడ్జ్ లో మువ్వన్నెల రెపరెపలు
Views: 15
On
ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆనందోత్సవాలతో జరిగాయి.తొలుత పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను స్పూర్తిగా తీసుకోవాలని కోరారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన పరేడ్ , నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments