మొండ్రాయిలో ఘనంగా గాంధీ జయంతీ వేడుకలు 

అనంతరం గ్రామా సభ నిర్వహించిన స్పెషల్ ఆఫీసర్ రమేష్  గ్రామా పంచాయితీ సిబ్బందికి సన్మానo

మొండ్రాయిలో ఘనంగా గాంధీ జయంతీ వేడుకలు 

IMG-20241003-WA0000

సంగె0,తెలంగాణ ముచ్చట్లు:

సంగేమ్ మండలం మొండ్రాయి గ్రామా పంచాయితీ ఆవరణలో మహాత్మ గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.పంచాయితీ కార్యదర్శి అనిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి దేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు మహత్మ గాంధీ అని,అందుకే ఆయనను జాతిపిత అని గౌరవిస్తామని తెలిపారు.గాంధీజీ అహింసో పరమో ధర్మః అని,ప్రతి ప్రాణి పట్ల ప్రేమ,దయ,కరుణ చూపాలని సూచించారన్నారు.

అనంతరం 2024-25 సంవత్సరానికి గాను జాతీయ ఉపాధి హామీ పథకంలో చేయాల్సిన పనులను గుర్తించి ప్రణాలికను రూపొందించి పలు తీర్మానాలు చేశారు.ఈ సందర్బముగా జాతీయా ఉపాధి హామీ పథకంలో భాగంగా చేసిన పనులను చేయాల్సిన పనులను ఫీల్డ్ అసిస్టెంట్ వేల్పుల సూరయ్య ప్రజలకు వివరించారు.

గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామా పంచాయితీ సిబ్బందికి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రమేష్,పంచాయితీ కార్యదర్శి అనిత,ఫీల్డ్ అసిస్టెంట్ వేల్పుల సూరయ్య,గ్రామ పంచాయితీ సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .