ప్రజావాణిలో 140 అర్జీల స్వీకరణ
సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు
Views: 8
On
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన 140 అర్జీలను స్వీకరించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య సంబంధిత శాఖల అధికారులను సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాల్సిందిగా ఆదేశించారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో కలసి కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రెవెన్యూ, నీటిపారుదల, వ్యవసాయం తదితర విభాగాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు అర్జీల రూపంలో అందజేశారు. అందిన 140 అర్జీలను ప్రాధాన్యంగా పరిశీలించి, సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో వై.వి.గణేష్, ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డాక్టర్ నారాయణ, డీఆర్డీవో మేన శ్రీను, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments