చిల్కానగర్ ఎంపిపిఎస్ ప్రభుత్వ పాఠశాలకు నిధులు కేటాయించండి 

కార్పొరేటర్ బన్నాల

చిల్కానగర్ ఎంపిపిఎస్ ప్రభుత్వ పాఠశాలకు నిధులు కేటాయించండి 

చిల్కానగర్, డిసెంబర్ 07 (తెలంగాణ ముచ్చట్లు) :

ఉప్పల్ నియోజకవర్గ చిల్కానగర్ ఎంపిపిఎస్ ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదుల నిర్మాణం కోసం తక్షణం నిధులు కేటాయించాలని కోరుతూ చిల్కానగర్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ శనివారం రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, 2024 డిసెంబర్‌లో అప్పటి డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డిని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి కలసి అదనపు గదుల నిర్మాణానికి సంబంధించిన వినతిపత్రం సమర్పించిన విషయాన్ని పేర్కొన్నారు.  ప్రాతినిధ్యాలు కు సంబంధించిన పత్రాలను కూడా డైరెక్టర్‌కి అందజేశారు.ప్రస్తుతం పాఠశాల భవనం శిథిలావస్థలోకి చేరడంతో పాటు విద్యార్థులు తరగతి గదుల కొరతతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని గీతా ప్రవీణ్ వివరించారు. వెంటనే నిధులు కేటాయించి పాఠశాల భవనం మరమ్మతులు మరియు అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని కోరారు.దీనిపై డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ సానుకూలంగా స్పందిస్తూ, ఈ ఆర్థిక సంవత్సరంలో కచ్చితంగా నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .